Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins జాబ్‌ కార్నర్ – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Fri, 22 Apr 2022 20:09:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png జాబ్‌ కార్నర్ – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 యువతకు అండగా.. అందరికీ ఆదర్శంగా.. https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-takes-caring-about-unemployment-youth/ Fri, 22 Apr 2022 20:05:25 +0000 https://www.prajabandhu.in/?p=1879 తాండూరు: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్న నేపధ్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రంలో వేలమంది నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారు.

హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రముఖ కోచింగ్ సెంటర్ల అధ్యాపకులచే ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ప్రజాబంధు నిర్వాహకులు అనునిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. వేల మంది అభ్యర్థులు శిక్షణ కోసం వస్తున్న నేపథ్యంలో పట్టణ పోలీస్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

నిరుద్యోగ యువత కోసం గతంలో ఎవరూ ఈ స్థాయిలో కృషి చేయలేదని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తీసుకున్న ఉచిత శిక్షణ నిర్ణయం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం చేస్తున్నారు.

]]> మెడికల్ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం https://www.prajabandhu.in/notification-for-medical-officer-posts-in-vikarabad/ Fri, 31 Dec 2021 07:18:58 +0000 https://www.prajabandhu.in/?p=1553 వికారాబాద్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ తుకారాం గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్న వారు అర్హులని తెలిపారు. జనవరి 3 నుంచి 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

]]>
ESICలో భారీగా ఉద్యోగాలు.. తెలంగాణలో 72 ఖాళీలు https://www.prajabandhu.in/esic-released-job-notification-with-huge-posts/ Thu, 30 Dec 2021 07:49:47 +0000 https://www.prajabandhu.in/?p=1542 కేంద్ర ప్రభుత్వ సంస్థ ESIC (ఎంప్లాయీస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) దేశంలోని వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీల సంఖ్య: 3820

ఆన్ లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేది: 2020 జనవరి 15

దరఖాస్తుకు చివరి తేది: 2022 ఫిబ్రవరి 15

ఉద్యోగ ఖాళీల వివరాలు:

అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌ (UDC): 1726

స్టెనోగ్రాఫర్: 163
మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (MTS): 1931
తెలంగాణలో భర్తీ చేసే పోస్టులు -72 
విద్యార్హతలు: ఎంటీఎస్‌ పోస్టులకు పదో తరగతి, స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌, అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
వయోపరిమితి:  అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌, స్టెనో గ్రాఫర్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు.. ఎంటీఎస్‌ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
నియామక ప్రక్రియ: రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్‌), స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం  https://www.esic.nic.in/ వెబ్ సైట్‌ను చూడండి.
]]>
నిరుద్యోగులకు శుభవార్త.. ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో రేపు జాబ్ మేళా https://www.prajabandhu.in/job-mela-conducting-on-thursday-in-vikarabad/ Wed, 22 Dec 2021 06:22:23 +0000 https://www.prajabandhu.in/?p=1494 ఫార్మసీ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం వికారాబాద్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌ సుభాన్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో గురువారం ఉదయం 10:30 గంటలకు జాబ్‌ మేళా ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. డీఫార్మసీ , బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిగ్రీ, ఇంటర్, ఎస్సెస్సీ చదివిన వారు ఈ మేళాకు హాజరు కావచ్చని పేర్కొన్నారు.

జాబ్‌ మేళాలో మొత్తం 250 మందిని ఎంపిక చేసుకుంటారని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు సెల్: 8374366444, 9177607016 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

]]>
సివిల్స్‌ విజేత.. మేఘన ఫ్రం తాండూర్‌ https://www.prajabandhu.in/civils-ranker-meghana-tandur/ Tue, 28 Sep 2021 20:08:12 +0000 https://www.prajabandhu.in/?p=1315 తాండూరు: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్ 2020 ఫలితాల్లో తాండూరు యువతి సత్తా చాటింది. నియోజకవర్గం పరిధిలోని బషీరాబాద్‌ మండలం మర్పల్లి గ్రామానికి చెందిన కావలి మేఘన మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా 83వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. దేశ స్థాయిలో ఘనత సాధించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకువచ్చిందని సాధారణ ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు ఆమెను అభినందిస్తున్నారు.

బాల్యం, విద్య సాగిందిలా..

మర్పల్లి గ్రామానికి చెందిన రాములు, సుజాత దంపతుల పెద్ద కుమార్తె మేఘన. ఆమె బాల్యం అంతా హైదరాబాద్‌లోనే గడిచింది. నగరంలోని మదీనాగూడ విజ్ఞాన్‌ విద్యాలయ పాఠశాలలో 10వ తరగతి, కూకట్‌పల్లి శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది. ఎన్‌ఐటీ వరంగల్‌లో ఎలక్ర్టికల్‌ ఇంజినీరింగ్‌, ఐఐఎం లక్నోలో పీజీ పూర్తి చేసింది.

ఉద్యోగం వదిలేసి సివిల్స్‌ వైపు..

చదువు పూర్తి చేశాక ఐటీసీ లిమిటెడ్‌ బెంగుళూర్‌లో అసిస్టెంట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరింది. 2019లో ఉద్యోగం మానేసి దేశ రాజధాని ఢిల్లీలోని వాజీరాం అండ్‌ రవి ఇన్‌స్టిట్యూట్‌లో సివిల్స్‌ కోచింగ్‌ కోసం చేరింది. 9 నెలల పాటు కోచింగ్‌ తీసుకున్నాక కరోనా కారణంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఇంట్లోనే ప్రిపరేషన్‌ కొనసాగించింది. తొలి ప్రయత్నంలోనే దేశ స్థాయిలో 83వ ర్యాంక్‌ సాధించి ఆందరినీ ఆశ్చర్యపరిచింది మేఘన. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కష్టపడి చదవడం వల్లే తనకు ఈ స్థాయి విజయం దక్కిందని ఆమె చెబుతుంది.

]]>
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలు https://www.prajabandhu.in/apply-for-anganwadi-posts/ Thu, 23 Sep 2021 09:04:23 +0000 https://www.prajabandhu.in/?p=1301 తాండూరు మడలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయా పోస్టులకు ధరఖాస్తు చేసుకునేందుకు గురువారం చివరి రోజు అని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ నిర్మల ఓ ప్రకటనలో తెలిపారు. ఓగిపూర్‌, సంకిరెడ్డిపల్లి తండాలో టీచర్‌ పోస్టులు, మల్కాపూర్‌, కోత్లాపూర్‌, గుండ్లమడుగు తండా, మైసమ్మతండా, నారాయణపూర్‌ గ్రామాల్లో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

]]>
535 ఖాళీలతో ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ నోటిఫికేషన్‌ https://www.prajabandhu.in/oil-india-limited-released-employment-notification-with-535-posts/ Thu, 26 Aug 2021 11:07:18 +0000 https://www.prajabandhu.in/?p=1103 ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (ఓఐఎల్‌) 535 ఖాళీలతో గ్రేడ్‌ 3 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చేనెల 23వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 535
ఎలక్ట్రీషియన్‌ 38, ఫిట్టర్‌ 144, మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌ 42, మెషినిస్ట్‌ 13, డీజిల్‌ మెకానిక్‌ 97, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌ 40, బాయిలర్‌ అటెండెంట్‌ 8, టర్నర్‌ 4, డ్రాట్స్‌మెన్‌ సివిల్‌ 8, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ 81, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ 44, సర్వేయర్‌ 5, వెల్డర్‌ 6, ఐటీ అండ్‌ ఈఎస్‌ఎం 5 చొప్పున ఖాళీలున్నాయి.

అర్హతలు: సంబంధిత విభాగంలో ఐటీఐ, ఇంటర్‌ చదివి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 23
వెబ్‌సైట్‌: https://www.oil-india.com

]]>
ఇండియన్‌ నేవీలో 302 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ https://www.prajabandhu.in/notification-released-to-recruit-employees-in-indian-navy/ Tue, 24 Aug 2021 09:32:39 +0000 https://www.prajabandhu.in/?p=1010 పోర్ట్‌ బ్లేయిర్‌లోని నావల్‌ షిప్‌ రిపేర్‌ యార్డులో ఖాళీగా ఉన్న పలు రకాల పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియన్‌ నేవీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 302 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో డిజిగ్నేటెడ్‌ ట్రేడ్‌, నాన్‌ డిజిగ్నేటెడ్‌ ట్రేడ్‌ మెన్‌ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు నోటిఫికేషన్‌ వెలువడిన 50 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

మొత్తం పోస్టులు: 302
మెషినిస్ట్‌ 16, ప్లంబర్‌/పైప్‌ ఫిట్టర్‌ 8, పెయింటర్‌ 7, టైలర్‌ 6, వెల్డర్‌ 20, మెకానిక్‌ ఎంటీఎం 7, వెల్డర్‌ షిప్‌ ఫిట్టర్‌ 3, షీట్‌ మెటల్‌ వర్కర్‌ 1, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ 46, ఎలక్ట్రిషన్‌ 29, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ 8, ఫిట్టర్‌ 37, డీజిల్‌ మెకానిక్‌ 42, ఆర్‌ఈఎఫ్‌ అండ్‌ ఏసీ మెకానిక్‌ 11, షీట్‌ మెటల్‌ వర్కర్‌ 18, కార్పెంటర్‌ 33, మాసన్‌ 7, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ 1 (నాన్‌ డిజైన్‌డ్‌ పోస్టులు) చొప్పున ఖాళీలున్నాయి.

అర్హతలు: పదవ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చదివి ఉండాలి. అభ్యర్థులు వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
అడ్రస్‌: HE COMMODORE SUPERINTENDENT (FOR Oi/C RECRUITMENT CELL),
NAVAL SHIP REPAIR YARD (PBR),
POST BOX NO. 705, HADDO,
PORT BLAIR – 744102,
SOUTH ANDAMAN
దరఖాస్తులకు చివరితేదీ: నోటిఫికేషన్‌ విడుదలైన 50 రోజుల్లో ధరఖాస్తు చేసుకోవాలి
వెబ్‌సైట్‌: https://www.indiannavy.nic.in/

 

]]>
పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరణ.. కలెక్టర్‌ జోక్యం కోరుతున్న అభ్యర్ధులు https://www.prajabandhu.in/%e0%b0%aa%e0%b0%b0%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b8%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%85%e0%b0%a8%e0%b1%81%e0%b0%ae%e0%b0%a4%e0%b0%bf/ Sat, 21 Aug 2021 06:19:21 +0000 https://www.prajabandhu.in/?p=866 తాండూరు: దరఖాస్తు ఫారంతో పాటు అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు జత చేయలేదనే కారణంతో మైనార్టీ గురుకుల ఉపాధ్యాయ పోస్టుల పరీక్ష రాసేందుకు పలువురికి అనుమతి నిరాకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలల్లో అధ్యాపక పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు పరీక్ష నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 10 వరకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తు చేసుకునే సమయంలో లోకల్ స్థానానికి సంబంధించిన స్టడీ బోనఫైడ్ సర్టిఫికెట్ జత చేయాలని ఉన్నతాధికారులు ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 23వ తేదీన జరిగే నియామక పరీక్షకు జిల్లాలో 153 మంది హాజరవుతారని, అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు జత చేయకపోవడంతో మరో 79మందిని పరీక్షకు అనుమతించడం లేదని మైనార్టీ గురుకుల శాఖ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ తిరుపతిరెడ్డి వెల్లడించారు. ఈ విషయంలో కలెక్టర్‌ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

]]>
ఓపెన్ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి https://www.prajabandhu.in/%e0%b0%93%e0%b0%aa%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%be%e0%b0%a0%e0%b0%b6%e0%b0%be%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5%e0%b1%87%e0%b0%b6%e0%b0%be%e0%b0%b2%e0%b0%95/ Thu, 19 Aug 2021 05:52:44 +0000 https://www.prajabandhu.in/?p=814 యాలాల: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ పాఠశాలలో ‍ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎంఈఓ సుధాకర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పదవ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పలు కారణాలతో మధ్యలో చదువు ఆపేసిన వారికి ఇది మంచి అవకాశమని సుధాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం యాలాల బాలుర ఉన్నత పాఠశాల ఓపెన్ స్కూల్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్‌ను 8328379942 నంబర్‌కు కాల్‌ చేసి సంప్రదించాలని సూచించారు.

]]>