Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins sabitareddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Fri, 10 Dec 2021 19:26:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png sabitareddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 బిపిన్ రావత్ సేవలు చిరస్మరణీయం https://www.prajabandhu.in/mla-pays-tributes-to-bipin-rawat/ Fri, 10 Dec 2021 19:26:52 +0000 https://www.prajabandhu.in/?p=1476 త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు అని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం బిపిన్ రావత్ చేసిన సేవలు చిరస్మరణీయం అని, భారత ప్రజలు ఆయనను ఎప్పటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు.

ఫాగ్గింగ్ మిషన్ల పంపిణీ..

తాండూరు పట్టణం తులసి గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని 123 గ్రామ పంచాయతీలకు మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాగ్గింగ్ మిషన్లను పంపిణీ చేశారు.

]]>
తాండూరులో మంత్రి సబితారెడ్డి పర్యటన https://www.prajabandhu.in/minister-sabitareddy-inaugurates-development-works-in-tandur/ Sun, 31 Oct 2021 06:20:45 +0000 https://www.prajabandhu.in/?p=1367 తాండూరు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. రూ.26.50 కోట్లతో తాండూరు పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు. రూ.20 కోట్లతో నిర్మించిన మాతాశిశు ఆస్పత్రి, రూ .2.25 కోట్లతో నిర్మించిన డిగ్రీ కళాశాల భవనం, తాండూరులో రూ.3.47 కోట్లతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. పారిశుధ్యం మెరుగుపరచడానికి గాను నూతనంగా తాండూరు మున్సిపాలిటీకి మంజూరైన 18 ట్రాలీ ఆటోలను ప్రారంభించారు. సాయిపూర్ 9వ వార్డులో రూ.20 లక్షలతో నిర్మించనున్న  అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్తాపన చేశారు. అనంతరం 165 మంది లబ్ధిదారులకు రూ.1.65 కోట్లు విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. తాండూరులో 100 పడకల ఆస్పత్రిని చూడగానే ఇంద్రారెడ్డి గుర్తుకువచ్చారన్నారు. పాతికేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తాండూరుకు వంద పడకల ఆస్పత్రి తెస్తానని ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన కల సాకారం కావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల తీసుకురావడం ఒకటి మిగిలి ఉందని, భవిష్యత్తులో అది కూడా నెరవేరుతుందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైతం లేని సమయంలో ఐదు కాలేజీలు మంజూరు చేయించానని ఆమె వెల్లడించారు.

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న కాలంలో తాండూరు నియోజకవర్గాన్ని సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తాండూరు అభివృద్ధిలో మంత్రి సబితారెడ్డి పాత్ర చాలా గొప్పదని, సీఎం కేసీఆర్ సహాకారంతో  నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.

]]>
అద్భుత ఘట్టానికి వేదికైన వికారాబాద్‌ https://www.prajabandhu.in/medicin-from-the-sky-project-launched-in-vikarabad/ Mon, 13 Sep 2021 09:34:20 +0000 https://www.prajabandhu.in/?p=1234 తెలంగాణ రాష్ట్రం మరోసారి చరిత్ర సృష్టించింది. దేశంలో డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఈ అద్భుత ఘట్టానికి వికారాబాద్‌ పట్టణం వేదికైంది. మారుమూల ప్రాంతాలకు సైతం మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టును వికారాబాద్‌లో కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ప్రారంభించారు

రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ఆధ్వర్యంలో ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీని అమలు కోసం వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌, నీతి ఆయోగ్, హెల్త్​నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలిసి ఐటీ శాఖ పనిచేస్తుంది

]]>